జూన్ 3 నుంచి 7 వరకు హిమాయత్​ నగర్​... టీటీడీ ఆలయ బ్రహ్మోత్సవాలు

జూన్ 3 నుంచి 7 వరకు హిమాయత్​ నగర్​... టీటీడీ ఆలయ బ్రహ్మోత్సవాలు

బషీర్​బాగ్, వెలుగు: హిమయత్ నగర్​టీటీడీ ఆలయ 20వ వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 3 నుంచి 7 వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఈఓ రమేశ్​తెలిపారు. శుక్రవారం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ ను ఆలయ అధికారులు, దాతలు ఆవిష్కరించారు. జూన్ 2న సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 3న ఉదయం ధ్వజారోహణం, తర్వాత శేష వాహనంపై శ్రీపద్మావతి గోదాదేవి సమేత శ్రీవారి ఊరేగింపు, సాయంత్రం 8 గంటలకు శ్రీహనుమంతవాహనంపై ఊరేగింపు ఉంటాయన్నారు. 

4న ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారన్నారు. 5న గజ వాహనంపై ఊరేగింపు ఉంటుందని, ఉదయం 10 గంటలకు శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు గరుడవాహనంపై ఊరేగింపు ఉంటాయన్నారు. 6న ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగింపు, 7న ఉదయం మహా పూర్ణాహుతి, చక్రసాన్నం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, 9 గంటలకు ధ్వజ వరోహణం జరుగుతాయని వెల్లడించారు.