ఏవోబీలో గంజాయి ఆపరేషన్‌‌‌‌కు బ్రేక్

ఏవోబీలో గంజాయి ఆపరేషన్‌‌‌‌కు బ్రేక్

నల్గొండ, వెలుగు:  ఆంధ్రా, ఒడిశా బార్డర్​లో నల్గొండ జిల్లా పోలీసులు తలపెట్టిన గంజాయి ఆపరేషన్​​​కు బ్రేక్​ పడింది. ఈ నెల 14న నల్గొండ నుంచి వైజాగ్​ వెళ్లిన నల్గొండ స్పెషల్​ పోలీస్ ​టీమ్స్ ​మూడు రోజులు పాటు ఏఓబీలో గంజాయి స్థావరాలపై మెరుపుదాడులు చేశాయి. గంజాయి స్థావరాలపైన పోలీసులు దాడులు చేస్తున్నారన్న సమాచారంతో అలర్ట్​అయిన స్మగ్లర్లు చాలామంది పారిపోయారు. ఆదివారం సాయంత్రం కొందరు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఏజెన్సీ ఏరియా కావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో తాత్కాలికంగా ఆపరేషన్​ నిలిపేస్తున్నట్లు పోలీసు ఆఫీసర్లు చెప్పారు. వైజాగ్​నుంచి ప్రత్యేక టీమ్స్​అన్నీ సోమవారం సాయంత్రం నల్గొండకు చేరుకున్నాయి. ఇప్పటికైతే పోలీసుల అదుపులో 20 మంది స్మగ్లర్లు ఉన్నట్లు తెలిసింది. వీరందరిని విచారించాక స్థావరాలకు సంబంధించి మరింత సమాచారం లభిస్తే వైజాగ్​పోలీసుల సపోర్ట్​తో తిరిగి దాడులు కొనసాగిస్తామని పోలీస్​ఆఫీసర్లు చెప్పారు.