వెంచర్ అనుమతికి లంచం: ఏసీబీకి చిక్కిన సర్పంచ్

వెంచర్ అనుమతికి లంచం: ఏసీబీకి చిక్కిన సర్పంచ్

వికారాబాద్ జిల్లా:  మరో అవినీతి చేప ఏసీడీకి చిక్కింది. వెంచర్ అనుమతి కోసం లంచం తీసుకుంటుండగా సర్పంచ్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. వికారాబాద్ జిల్లా, పూడూర్ మండలం, మన్నెగూడ సర్పంచ్ పై శుక్రవారం ఏసీబీ అధికారుల దాడులు చేశారు. మన్నెగూడలో వెంచర్ అనుమతి కోసం సర్పంచ్ భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో వెంచర్ యజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యదు చేయడంతో.. పక్కా ప్లాన్ వేసి ,రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా సర్పంచ్ ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.