
బూర్గంపహాడ్, వెలుగు: రేషన్ కార్డు ప్రాసెస్ కోసం రూ.2,500 లంచం తీసుకుంటూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ తహాసీల్దార్ ఆఫీస్లో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపహాడ్ మండలానికి చెందిన వ్యక్తి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రేషన్ కార్డు మంజూరు కోసం కంప్యూటర్ ఆపరేటర్ నవక్రాంత్ ను సంప్రదించగా, రూ.4 వేలు లంచం డిమాండ్ చేయగా, లబ్ధిదారుడు ఏసీబీని ఆశ్రయించాడు.
వారి సూచనల మేరకు శనివారం అడ్వాన్స్గా రూ.2,500 ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నవక్రాంత్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బూర్గంపహాడ్ తహాసీల్దార్ కార్యాలయంపై మూడోసారి ఏసీబీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. 2014లో ఇన్చార్జి తహసీల్దార్, టైపిస్ట్ దినేశ్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. 2018లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఇసుక అనుమతులు కోసం అప్పటి డిప్యూటీ తహసీల్దార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.