అప్పులు తీర్చేందుకు.. దొంగలుగా మారిన అన్నాదమ్ములు..

అప్పులు తీర్చేందుకు.. దొంగలుగా మారిన అన్నాదమ్ములు..

చేసిన అప్పులు తీర్చేందుకు దొంగతనాలకు ఒడిగట్టారు అన్నాదమ్ములు.. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పంచశీల కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. వారిని అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి  రూ. 12 లక్షల విలువైన బంగారం నగదును స్వాధీనం చేసుకున్నారు. అప్పులు తీర్చేందుకు అశోక్ రెడ్డి తన తమ్ముడు మధుసూదన్ రెడ్డి దొంగతనానికి ఒడిగట్టినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడినట్లు పేర్కొన్నారు పోలీసులు.