సర్కారీ పోర్టల్ హ్యాక్ చేసిన అన్నదమ్ములు

సర్కారీ పోర్టల్ హ్యాక్ చేసిన అన్నదమ్ములు

హైదరాబాద్, వెలుగు: సర్కార్ పోర్టల్ ను హ్యాక్ చేసి ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న అన్నదమ్ములను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 ల్యాప్ టాప్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఆ కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా అయ్యప్పనగర్కు చెందిన సిసోడియా అరిహంత్ జైన్ (25), సిసోడియా ఆదేశ్ జైన్(21) అన్నదమ్ములకు నాలుగు ఇసుక లారీలు ఉన్నాయి. ఇసుకను అక్రమ రవాణాకు ప్లాన్ చేశారు. అందుకు రాష్ట్ర సర్కార్ శాండ్ సేల్స్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ బుకింగ్స్ టెక్నిక్స్ తెలుసుకున్నారు. ఆటోఫిల్ సాఫ్ట్ వేర్ ను కొని ల్యాప్ టాప్స్ లో ఇన్ స్టాల్ చేసుకున్నారు. పుణేకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనురాగ్ తో 40 శాతం వరకు కమీషన్ ఇస్తామని చెప్పి ర్యాపిడ్ బుకింగ్ సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేయించారు. దీంతో ‘తెలంగాణ శాండ్ ప్రొడక్టివిటీ టూల్’ను రూ.3 వేలకు అదేశ్ ల్యాప్ టాప్ లో ఇల్లీగల్ గా అనురాగ్ ఇన్ స్టాల్ చేశాడు. గూగుల్లో యాడ్స్ ఇస్తూ ఇసుకను అక్రమ మార్గాల్లో బుక్ చేసేవాళ్లు. వ్యాపారులతో దందా చేస్తూ ఒక్కో బుకింగ్ కు రూ.1,400 నుంచి రూ.1,600 వరకు కమీషన్ వసూలు చేశారు. బినామీల పేరిట ఆదేశ్ నాలుగు, అరిహంత్ ఒక బ్యాంక్ అకౌంట్ తెరిచారు. పోతుల సందీప్ రెడ్డి, యాద అభినవ్, శాస్త్రీ లక్ష్మి ప్రసాద్ పేర్లతో మరో 3 బినామీ అకౌంట్లు ఓపెన్ చేశారు. ఐటీ చెల్లించకుండా రూ.50 లక్షల ఇల్లీగల్ బిజినెస్ చేశారు. ఇలాగే ఎజెడ్ క్యాప్చా, వ్రోక్ స్పేస్, మహాదేవ్ ప్లానెట్ పేరుట ఇసుక బుకింగ్ పోర్టల్స్ నడుపుతున్నట్టూ పోలీసులు గుర్తించారు.

For More News..

వట్టి డిగ్రీలతో లాభం లేదు

విషం తాగిన ప్రేమ జంట