
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్ గోముల్ పోలీసు స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ కేసు విషయంలో కడ్మూరుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజకీయ కక్ష్యతో తమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారంటూ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మే 13 న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఎమ్మెల్యే అండతో తమపై రాజకీయ కక్ష్య గట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
.