కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్

కవితపై ముమ్మాటికి  కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు   : కేసీఆర్

కవితపై కుట్రపూరితంగా కేసు పెట్టారన్నారు మాజీ సీఎం కేసీఆర్. ముమ్మాటికి అక్రమ అరెస్టున్నారు. కవిత తప్పుచేసినట్లు 100 రూపాయల ఆధారం చూపలేకపోయారని చెప్పారు కేసీఆర్. బీఎల్ సంతోష్ పై కేసు పెట్టకపోతే..కవిత అరెస్టు అయ్యేది కాదన్నారు కేసీఆర్. 102 సీట్లు ఉన్నప్పుడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూసిందన్నారు.. ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న సీట్లు చూస్తే బీజేపీ కొనడం ఎంతసేపన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్ లోజరిగిన ముఖ్యనేతల సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు.

 కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఖరారైనట్టు తెలుస్తోంది. అలంపూర్ జోగులాంబ నుంచి కేసీఆర్ యాత్ర మొదలు పెట్టనున్నారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తారన్నారు గులాబీ బాస్. రానున్న రోజులు మనవే అన్నారు. ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. మళ్లీ  మనమే గెలిచి, అధికారంలోకి వస్తామన్నారు కేసీఆర్.