సీఎం, మంత్రులు కోడ్ ఉల్లంఘిస్తున్నరు.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

సీఎం, మంత్రులు కోడ్ ఉల్లంఘిస్తున్నరు.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం, మంత్రులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ)  బీఆర్ఎస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అలాగే అక్కడ మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారని.. బుర్ఖాలతో వచ్చి దొంగ ఓట్లు వేసే చాన్స్​ ఉందని ఆరోపించారు. దీన్ని నివారించేందుకు ప్రతి బూత్​ను వెబ్​కెమెరాలతో కనెక్ట్​చేసి.. లైవ్​ను మానిటరింగ్ చేయాలని కోరారు. 

శుక్రవారం బీఆర్ఎస్ ఎంపీలు దామోదర్ రావు, కేఆర్ సురేశ్ రెడ్డి ఢిల్లీలో ఈసీకి ఈ మేరకు కంప్లైంట్ కాపీ అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటమి భ‌‌‌‌యం ప‌‌‌‌ట్టుకుంద‌‌‌‌ని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నార‌‌‌‌ని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత‌‌‌‌ల‌‌‌‌పై వేధింపుల‌‌‌‌కు పాల్పడుతున్నార‌‌‌‌న్నారు.