కాంగ్రెస్ సంక్షేమపథకాలను.. ఓర్వలేకనే బీఆర్ఎస్ విమర్శలు

కాంగ్రెస్ సంక్షేమపథకాలను.. ఓర్వలేకనే  బీఆర్ఎస్ విమర్శలు

పరిగి, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన జనహిత పాదయాత్ర విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని పరిగి మార్కెట్ చైర్మన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పరశురాంరెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడారు. 

కాంగ్రెస్​ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోందన్నారు. బీఆర్​ఎస్​ పదేళ్లు ప్రజా  సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. కార్యక్రమంలో పార్థసారథి పంతులు, ఎర్రగడ్డపల్లి కృష్ణ, లాల్ కృష్ణప్రసాద్, జమీల్, నసీరుద్దిన్,  గోపాల్  తదితరులు పాల్గొన్నారు.