జూబ్లీహిల్స్ కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. తన కుమారుడికి ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ, పంజాగుట్ట ఏసీపీ,సిఐ,జూబ్లీహిల్స్ సీఐ బాధ్యత వహించాలన్నారు. ఈ కేసులో తన కుమారుడి తప్పుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటానన్నారు.
ఈ కేసులో తన కుమారుడి ప్రమేయం లేదని.. ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని షకీల్ డిమాండ్ చేశారు. తనపై రాజకీయ కక్ష ఉంటే తన కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. తన కుమారుడిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని.. అంతేకాకుండా చంపేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారంటూ షకీల్ ఆరోపించారు.
కేసు పారదర్శకంగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానని షకీల్ అన్నారు. తన ఆరోగ్యం బాగాలేకపోయినా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానన్నారు. ప్రస్తుతం తన కుమారుడు మానసిక ఒత్తిడికి గురి అయితే హాస్పిటల్ లో చికిత్స తీకుంటున్నట్లుగా షకీల్ తెలిపారు.