కేటీఆర్, హరీశ్​ను​ చవటలు అనగలం : జగ్గారెడ్డి

కేటీఆర్, హరీశ్​ను​ చవటలు అనగలం : జగ్గారెడ్డి
  •     మేం స్టార్ట్​ చేస్తే డిక్షనరీలో వెతికి మరీ తిడతం: జగ్గా రెడ్డి
  •     కోదండరాంకు ఎమ్మెల్సీ పదవిస్తే ఎందుకంత రాద్ధాంతం?
  •     బీఆర్​ఎస్​ అవమానిస్తే.. తాము గౌరవిస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ‘‘మేము తిట్టడం మొదలు పెడితే డిక్షనరీలో వెతికి మరీ తిడుతం. కేటీఆర్, హరీశ్​లు చవటలు అని మేము అనగలం. మావొళ్లు అట్ల అంటే వాళ్లకు బాధగా ఉండదా? ” అని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి అన్నారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని, విలువల్లేని రాజకీయాలు చేస్తున్నది కేటీఆర్​ అని ఆయన విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్.. పొన్నంని బట్టలిప్పుతా అంటవా? అంత తీస్మార్​ ఖాన్​వి అనుకుంటున్నవా? నువ్వెంత నీ కెపాసిటీ ఎంత? అనవసరంగా గౌరవం పోగొట్టుకోవద్దు’’ అంటూ మండిపడ్డారు.

గవర్నర్​కు ఉన్న హక్కులను కేసీఆర్​ కాలరాశారని విమర్శించారు. గవర్నర్​ను, రాజ్యాంగాన్ని రేవంత్​ గౌరవించారని అన్నారు. ప్రొఫెసర్​ కోదండరామ్​ గురించి మాట్లాడే అర్హతే కేటీఆర్​కు లేదని జగ్గారెడ్డి అన్నారు. ప్రజా పోరాటం నుంచి జేఏసీ ఏర్పడిందని,  జేఏసీ కన్వీనర్​గా కోదండరామ్​ ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. ‘‘రాష్ట్రం ఏర్పడి, అధికారంలోకి వచ్చాక తొమ్మిదేండ్లలో ఎప్పుడైనా అతన్ని గౌరవించారా? ఎన్నో అవమానాలకు గురి చేశారు. ఇప్పుడు మేం ఆయన్ను ఎమ్మెల్సీ చేసి గౌరవిస్తే.. కేటీఆర్​ రాద్ధాంతం చేస్తున్నారు.

కనీసం కాంగ్రెస్​ వాళ్లైనా కోదండరామ్​ను ఎమ్మెల్సీ చేశారని బీఆర్​ఎస్​ లీడర్లు బయటకు చెప్పకపోయినా మనసులోనైనా అనుకోండి. గవర్నర్​కు కృతజ్ఞతలు చెప్పండి.’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నన్నాళ్లూ ఏతులు మాట్లాడిన కేటీఆర్​.. ఇప్పుడు నీతులు చెప్తున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​, బీజేపీది ఫెవికాల్​ బంధమంటే నమ్మే పిచ్చోళ్లు ఎవరూ లేరని జగ్గా రెడ్డి అన్నారు. ఇద్దరం బద్ధ శత్రువులమని, ఎదురెదురు పడితే పొడుచుకోవడమేనని చెప్పారు. ‘‘బండి సంజయ్​ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేసింది కేసీఆర్​ చెప్పినందుకు కాదా? కవిత రేపే జైలుకు పోతదంటూ ప్రచారం చేశారు.

 కానీ, ఎందుకు అరెస్ట్​కాలేదు. ఫెవికాల్​ బంధం మీదా? మాదా? సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు హరీశ్​ రావు రూ.25 కోట్లు ఖర్చు చేశారు. ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి?  రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కాంగ్రెస్​ పార్టీ రూ.60 వేల కోట్లు తెలంగాణకు మిగులు బడ్జెట్​ ఇచ్చింది. కానీ, ఇప్పుడు రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారు. చిన్నప్పుడు అన్నం గిన్నెలో మాడిపోయిన అన్నాన్ని గీకి పెట్టెటోళ్లు. బీఆర్​ఎస్​ ప్రభుత్వమూ బడ్జెట్​ను అట్లనే చేసింది. మాడు లేకుండా నాకి పారేశారు. సర్ఫ్​తో కడగాల్సిన అవసరమేలేదన్నట్టు నాలుకతో గీకేశారు’’ అంటూ ఫైర్​జగ్గారెడ్డి అయ్యారు