కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: కాంగ్రెస్ ​నేత, మాజీ ఎంపీ సోయం బాపూరావు సమక్షంలో ఆయన నివాసంలో ఇచ్చోడ మండలం కేశవ్​పట్నం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్​ నేతలు, కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్​లో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 

రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నియోజవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.