
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సోయం బాపూరావు సమక్షంలో ఆయన నివాసంలో ఇచ్చోడ మండలం కేశవ్పట్నం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్లో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నియోజవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.