నిజాంపేట మండలంలో కాంగ్రెస్​లో చేరికలు

నిజాంపేట మండలంలో కాంగ్రెస్​లో  చేరికలు
  • పలువురు తాజామాజీ  సర్పంచ్ లు సైతం 

నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బుధవారం నిజాంపేట  ఎంపీపీ సిద్దిరాములు తో పాటు పలు గ్రామాల తాజా మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి   మెదక్​ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నార్లాపూర్ మాజీ సర్పంచ్ అమరసేనా రెడ్డి, చల్మెడ మాజీ సర్పంచ్ నర్సింహ్మ రెడ్డి, రజాక్ పల్లి సర్పంచ్​ భర్త నాగరాజు, తిప్పన్నగుల్ల సర్పంచ్​ భర్త యాదగిరి  తదితరులు ఉన్నారు.