ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలి : బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేణులు

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలి : బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేణులు
  •     ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేణుల నిరసన

నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎలాంటి ఫీజులు వసూలుచేయకుండా ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాట్లను రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేణులు ఆందోళన చేశారు. పలువురు లీడర్లు మాట్లాడుతూ రూ.20వేల కోట్లు దండుకోవడానికే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెరపైకి తెచ్చిందన్నారు. అధికారంలోకి రాకముందు ఎల్ఆర్​ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫ్రీగా చేస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేంటని ప్రశ్నించారు.  
 

సిరిసిల్లలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నాకు దిగారు.  చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో, గోదావరిఖనిలో బల్దియా ఆఫీసు ఎదుట, కోరుట్ల, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ఎమ్మెల్యే కె.సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో, వేములవాడలో నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో, జగిత్యాలలో మున్సిపల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు.