మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఆదివారం (డిసెంబర్ 10) మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, బీఆర్ ఎస్ నేతలు వినోద్ కుమార్, కే.కేశవరావులు, దాసోజు శ్రవణ్ లు యశోదా ఆస్పత్రికి వచ్చి మాజీసీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు మాజీ ఎంపీ , కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు యశోద ఆస్పత్రికి వచ్చి మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  

మూడు రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ ఎడమకాలి తుంటికి తీవ్ర కావడంతో శస్త్ర చికిత్స చేసి తుంటి ఎముక రీప్లేస్ మెంట్ చేశారు. ఆపరేషన్ అనంతరం కోలుకుంటున్న మాజీ సీఎంను పలువురు పరామర్శించారు.  తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్ ను  ఆస్పత్రిలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.