బీఆర్ఎస్ మీటింగ్‭లో జై కాంగ్రెస్ నినాదాలు

బీఆర్ఎస్ మీటింగ్‭లో జై కాంగ్రెస్ నినాదాలు

జయశంకర్ భూపాలపల్లిలో బీఆర్ఎస్ మీటింగ్ లో జై కాంగ్రెస్ నినాదాలు వినిపించాయి. రేగొండ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి.. జై బీఆర్ఎస్‭కు బదులుగా జై కాంగ్రెస్ అని పలికారు. ఉపాధి హామీ పనులపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర  ప్రభుత్వంపై వహిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సభను ఉత్తేజ పరిచేందుకు చేసిన నినాదాలలో జై కాంగ్రెస్ అని పలికారు. 

జై కాంగ్రెస్ నినాదం వినిపించడంతో అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు షాక్ అయ్యారు. రేగొండ మండల ప్రధాన కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి పై చర్యలు తీసుకోవాలని జిల్లా నాయకులకు ఫిర్యాదు చేశారు.