పదేండ్లు అధికారంలోఉండి ఇప్పుడు విమర్శలా : ఎమ్మెల్యే వివేకానంద్

పదేండ్లు అధికారంలోఉండి ఇప్పుడు విమర్శలా : ఎమ్మెల్యే వివేకానంద్
  • కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్​ఎమ్మెల్యే వివేకానంద్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత.. ఇప్పుడెందుకు బీఆర్ఎస్​పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారని బీఆర్ఎస్​ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​ప్రశ్నించారు. ఎవరి కోసం.. ఏ పార్టీ లాభం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నరని కవితను నిలదీశారు. 

ఆదివారం ఆయన తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో కింది స్థాయి కార్యకర్త నుంచి పెద్ద లీడర్ల వరకు ఎంతో శ్రమించారని తెలిపారు. అలాంటి వారిని చిన్నచూపు చూసేలా కవిత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ చేసిన అరాచకాలు, రౌడీయిజంపై పల్లెత్తు మాట అనని కవిత.. బీఆర్ఎస్​ పార్టీని మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారని ఫైర్​అయ్యారు. 

పదవులు లేకున్నా కేసీఆర్ నాయకత్వంలో సంతోషంగా పనిచేసే ఉద్యమకారులు తమతో ఉన్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్​మళ్లా సీఎం కావాలని కోరుకుంటుంటే.. ఆయన కూతురిగా కవిత మాత్రం లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని వివేకానంద్ పేర్కొన్నారు.