ఒక్క జీవోతో లక్షలాది కుటుంబాలు రోడ్డుపాలు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

ఒక్క జీవోతో లక్షలాది కుటుంబాలు రోడ్డుపాలు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 84 వల్ల ఔట్​డోర్​మీడియా రంగం సమస్యలు ఎదుర్కొంటున్నదని, ఆ జీవోతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​అన్నారు. రాష్ట్రంలో ఔట్​డోర్​ మీడియా రంగంలో 300 నుంచి 400 ఏజెన్సీలున్నాయని, ప్రకటనలు, హోర్డింగ్స్​ నిర్వహణ, ఇన్‌స్టాలేషన్​ వంటి పనులతో వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు.

మొత్తంగా 5 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు. ఈ మేరకు శనివారం తెలంగాణభవన్‌లో ఔట్​డోర్​ మీడియా ఓనర్స్​ అసోసియేషన్​ సభ్యులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక దొంగ జీవోను తెచ్చి ఔట్​డోర్​ మీడియా రంగాన్ని కొందరికే కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.