రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నరు .. సీఎం రేవంత్‌‌‌‌పై దాసోజు శ్రవణ్ కామెంట్స్

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నరు .. సీఎం రేవంత్‌‌‌‌పై దాసోజు శ్రవణ్ కామెంట్స్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ‘‘సీఎం రేవంత్ తెలంగాణ ప్రజలకు శాపంలా పరిణమించారు. మోదీని నొప్పించకుండా, చంద్రబాబును మెప్పించేలా ఆయన ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టి బనకచర్లకు సహకరిస్తున్నారు”అని ఫైర్ అయ్యారు. గోదావరి, కృష్ణా జలాలను ఏపీకి ఫణంగా పెడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.

 శనివారం తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో దాసోజు మాట్లాడారు. ‘‘గోదావరి జలాలను వాడుకుని తెలంగాణను సస్యశ్యామలం చేశాక.. రాయలసీమకు నీళ్లివ్వాలని అపెక్స్​కౌన్సిల్​మీటింగ్‌‌‌‌లో కేసీఆర్ అన్నారు. ఆ మాటల్లో తప్పేముంది? సీఎం హోదాలో ఉండి బాడీషేమింగ్​వ్యాఖ్యలు చేయొచ్చా? హరీశ్​రావు పొడుగ్గా ఉంటే రేవంత్‌‌‌‌కు వచ్చిన నష్టమేంటి? రేవంత్​పొట్టిగా ఉండి సీఎం కాలేదా? రేవంత్‌‌‌‌కు దమ్ముంటే హరీశ్​రావుతో చర్చకు రావాలి”అని డిమాండ్ చేశారు.