సిద్దిపేట జిల్లాలో..కాంగ్రెస్​లో చేరిన మాజీ సర్పంచ్​లు

సిద్దిపేట జిల్లాలో..కాంగ్రెస్​లో చేరిన మాజీ సర్పంచ్​లు

దుబ్బాక, వెలుగు : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి  మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్​లు మూకుమ్మడిగా బీఆర్​ఎస్ కు​రాజీనామా చేశారు. సోమవారం కాంగ్రెస్​నియోజకవర్గ ఇన్‌‌చార్జి చెరుకు శ్రీనివాస్​రెడ్డి, సిద్దిపేట ఇన్‌‌చార్జి పూజల హరికృష్ణ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్​ప్రభుత్వం చేపడుతున్న ఆరు గ్యారంటీలు, ప్రజారంజక పాలనకు ఆకర్శితులై కాంగ్రెస్​లో చేరుతున్నారని చెప్పారు.

త్వరలో నియోజకవర్గంలోని ఎంపీటీసీలు అందరూ కాంగ్రెస్​లో చేరడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్​లో చేరిన మాజీ సర్పంచ్​లలో భారతి భూపతి గౌడ్, చుక్క శంకర్, గుల్ల పుష్ప భాగులు, చంద్రమౌళి, ఎనగంటి కిష్టయ్య, నర్సింహారెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో తుక్కాపూర్​ సర్పంచ్​ విజయ్ రెడ్డి పాల్గొన్నారు.

బీఆర్ఎస్​కు పీఏసీఎస్​ వైస్ ​చైర్మన్ ​గుడ్​బై

దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్​ చైర్మన్​ కాల్వ నరేశ్​ బీఆర్ఎస్​కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఎమ్మెల్యే వైఖరికి విసుగు చెంది ఆత్మాభిమానం చంపుకోలేక బీఆర్ఎస్​కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.