కాళేశ్వరంతో నిండా ముంచిన్రు : జితేందర్ రెడ్డి

కాళేశ్వరంతో నిండా ముంచిన్రు : జితేందర్ రెడ్డి

పాలమూరు, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్  పార్టీ నేతలు రూ.లక్ష కోట్ల ప్రజాధనం దోచుకున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

మాజీ సీఎం కేసీఆర్  రూ.7 లక్షల కోట్ల అప్పుచేసి రాష్ట్ర ప్రజలను నిండా ముంచారని, రాష్ట్రానికి కొత్తగా అప్పులు పుట్టే అవకాశం కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్   ప్రభుత్వానికి నిధులు రావడం కష్టంగా మారిందన్నారు. రామరాజ్య స్థాపనే ధ్యేయంగా రామ మందిర నిర్మాణం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలరాజ్, మహిళా మోర్చారాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.