కరీంనగర్లో మార్చి 12న బీఆర్ఎస్ బహిరంగ సభ

కరీంనగర్లో మార్చి 12న బీఆర్ఎస్  బహిరంగ సభ

బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇవాళ తెలంగాణ భవన్ లో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశమైన కేసీఆర్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్..కాళేశ్వరంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మార్చి  12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో భారీ  బహిరంగ సభ ఉంటుందన్నారు.  కరీంనగర్ లోక్ సభ స్థానాన్ని బీఆర్ఎస్ గెలవబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత  వచ్చిందన్నారు. రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి  ఏర్పడిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టిచుకోవద్దు..నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ అన్నారు.  

ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఖరారు

 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  కేసీఆర్ మార్చి 4న అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు పార్టీ నేతలు. పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ త్వరలోనే కేసీఆర్ బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించారు.