
వనపర్తి, వెలుగు: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవని, బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆదివారం పార్టీ జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో విశ్వాసం, పార్టీ పట్ల నిబద్ధత, అధినాయకుడి పట్ల విధేయత ఉన్నవారే పార్టీ అభ్యర్థులుగా ఉంటారని తెలిపారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులను పార్టీ గుర్తిస్తుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, కురుమూర్తి యాదవ్, విజయ్ కుమార్, పరంజ్యోతి, బి.కృష్ణ, నాగన్న యాదవ్, ఉంగ్లం తిరుమల్, సమద్, ప్రేమ్ నాథ్ రెడ్డి, గులాం ఖాదర్, శశిభూషణ్ నాగమ్మ, సాయిలీల, కవిత నాయక్, స్వాతి పాల్గొన్నారు.