కంటోన్మెంట్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్దే గెలుపు : తలసాని

కంటోన్మెంట్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్దే గెలుపు : తలసాని

కంటోన్మెంట్ బై ఎలక్షన్ తో పాటుగా మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక నేపథ్యంలో మల్లారెడ్డి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సాయన్న చేసిన సేవలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ఎంతోమందికి లబ్ధి చేకూరిందని అన్నారు.. నివేదితకు సాయన్న కుటుంబానికి బీఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు అండగా ఉండాల్సిన సమయం ఇదేనని చెప్పారు.  గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమమే ఇప్పటికే కొనసాగుతుందని, కంటోన్మెంట్ కు కాంగ్రెస్, బీజేపీ లు చేసిందేమీ లేదని విమర్శి్ంచారు.  ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావులు పాల్గొంటారని, వార్డుల వారీగా పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేయనున్నట్లు తలసాని  తెలిపారు.