హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ నుంచి సంస్కారం నేర్చుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్అన్నారు. రాహుల్గాంధీపై సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారంటూ జానారెడ్డి చేసిన కామెంట్లకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఆదివారం జలవిహార్లో మీడియాతో మాట్లాడారు.
ఒక దొంగను తీసుకువచ్చి రూ.50 కోట్లకు పీసీసీ చీఫ్పదవి అమ్ముకునే దౌర్భాగ్యమైన పార్టీ అది. పీసీసీ అధ్యక్ష పదవి, అసెంబ్లీ సీట్లు అమ్ముకుంటున్నారు. జానారెడ్డి సంస్కారం గురించి చెప్పాలంటే వాళ్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే చెప్పుకోవాలె. కేసీఆర్ కు పిండం పెట్టుమని అన్నప్పుడు సంస్కారం ఎటు పోయింది. కేసీఆర్ ను బహిరంగంగా ఉరితీసి రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు ఎక్కడ చచ్చింది సంస్కారం. అప్పుడు ఇదే జానారెడ్డి నోరు ఎందుకు పెగలలేదు.
కాంగ్రెస్సన్నాసుల నుంచి సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. రేవంత్ రెడ్డి టికెట్లు ఇచ్చేందుకు డబ్బులు వసూలు చేస్తున్నాడని సొంత పార్టీ నేతలే ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారు. అలాంటి పార్టీ మాకు సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదు” అని కేటీఆర్ అన్నారు.