
హైదరాబాద్, వెలుగు : ఓ విద్యార్థిని నర్సింగ్ చదువుకు బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇల్లందు పట్టణంలోని ఆజాద్నగర్కు చెందిన అన్నపూర్ణ.. ఆదివారం తెలంగాణ భవన్కు వచ్చి కేటీఆర్ను కలిశారు. తన కుమార్తె నర్సింగ్ చదివేందుకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆమెతో మాట్లాడి.. ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆరా తీశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగుసార్లు ప్రజాదర్బార్కు వచ్చి.. తన కుమార్తె చదువుకు సాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నానని తెలిపింది.
అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్రెడ్డిని కలిసేందకు రోజంతా పడిగాపులు కాసినా పోలీసులు లోపలికి పంపలేదని పేర్కొంది. అక్కడే ఉన్న కొందరు తెలంగాణ భవన్కు వెళ్లి కేటీఆర్ను కలవాలని తనకు చెప్పారని, అందుకే ఇక్కడికి వచ్చానని వివరించింది. తన కుటుంబ పరిస్థితి దుర్భరంగా ఉందని, బిడ్డ చదువుకు సాయం అందించాలని కోరింది. దీంతో స్పందించిన కేటీఆర్ బంజారాహిల్స్నందినగర్లోని తన నివాసానికి ఆమెను పిలిపించి రూ.లక్ష చెక్కు అందజేశారు.