హద్దు దాటిన పాక్​ జవాన్

హద్దు దాటిన పాక్​ జవాన్
  • అదుపులోకి తీసుకున్న బీఎస్​ఎఫ్​

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై యావత్​ దేశం రగిలిపోతుంటే పాకిస్తాన్​ మాత్రం కవ్వింపు చర్యలకు తెగబడుతూనే ఉంది. ఎల్​వోసీ సహా అంతర్జాతీయ సరిహద్దు వెంట కాల్పులకు దిగుతుంది. దీనికి మన సైన్యం దీటుగా జవాబు చెప్తున్నది.

 శనివారం  ‘హద్దు’​ దాటి ఇండియాలోకి ప్రవేశించిన ఓ పాక్​ జవాన్​ను రాజస్తాన్​లో మన బీఎస్​ఎఫ్​ అదుపులోకి తీసుకుంది.  కాగా, గత నెల 23న అనుకోకుండా బార్డర్​ క్రాస్​ చేసిన మన జవాన్​ పీకే షాను అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్​ ఇప్పటికీ తిరిగి అప్పగించేందుకు నిరాకరిస్తూనే ఉంది.