
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ రివైవల్ కోసం రూ. 89,047 కోట్ల ప్యాకేజ్ను బుధవారం కేబినెట్ ఆమోదించింది. బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం ఇస్తున్న మూడో రివైవల్ ప్యాకేజ్ ఇది. బీఎస్ఎన్ఎల్కు ఈక్విటీ రూపంలో ఈ ఫండ్స్ ఇస్తారు. ఆ మొత్తాన్ని 4 జీ, 5 జీ స్పెక్ట్రమ్ కోసం బీఎస్ఎన్ఎల్ వెచ్చించాల్సి ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ఆథరైజ్డ్ఈక్విటీని ఇప్పుడున్న రూ. 1.50 లక్షల కోట్ల నుంచి రూ. 2.10 లక్షల కోట్లకి పెంచాలని నిర్ణయించారు.
రూ.46,338.60 కోట్ల విలువైన ప్రీమియం వైర్లెస్ ఫ్రీక్వెన్సీస్ 700 ఎంహెచ్జెడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, రూ. 26,184.20 కోట్ల విలువైన 3300 ఎంహెచ్జెడ్బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, రూ. 6,564.93 కోట్ల విలువైన 26 జీహెచ్జెడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, రూ. 9,428.20 కోట్ల విలువైన 2500 ఎంహెచ్జెడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ తాజా ప్యాకేజ్లో భాగంగా బీఎస్ఎన్ఎల్కు లభించనున్నాయి.