బీఎస్​ఎన్​ఎల్​కు రూ. 89 వేల కోట్ల ప్యాకేజ్

బీఎస్​ఎన్​ఎల్​కు రూ. 89 వేల కోట్ల ప్యాకేజ్

న్యూఢిల్లీ: బీఎస్​ఎన్​ఎల్​ రివైవల్​ కోసం రూ. 89,047 కోట్ల ప్యాకేజ్​ను బుధవారం కేబినెట్​ ఆమోదించింది. బీఎస్​ఎన్​ఎల్​కు ప్రభుత్వం ఇస్తున్న మూడో రివైవల్​ ప్యాకేజ్​ ఇది. బీఎస్​ఎన్​ఎల్​కు ఈక్విటీ రూపంలో ఈ ఫండ్స్​ ఇస్తారు. ఆ మొత్తాన్ని  4 జీ, 5 జీ స్పెక్ట్రమ్​ కోసం బీఎస్​ఎన్​ఎల్​ వెచ్చించాల్సి ఉంటుంది.  బీఎస్​ఎన్​ఎల్​ఆథరైజ్డ్​ఈక్విటీని ఇప్పుడున్న రూ. 1.50 లక్షల కోట్ల నుంచి రూ. 2.10 లక్షల కోట్లకి పెంచాలని నిర్ణయించారు.

రూ.46,338.60 కోట్ల విలువైన  ప్రీమియం వైర్​లెస్​ ఫ్రీక్వెన్సీస్​ 700 ఎంహెచ్​జెడ్​ బ్యాండ్​ స్పెక్ట్రమ్, రూ. 26,184.20 కోట్ల విలువైన 3300 ఎంహెచ్​జెడ్​​బ్యాండ్​ ఫ్రీక్వెన్సీ, రూ. 6,564.93 కోట్ల విలువైన 26 జీహెచ్​జెడ్​ బ్యాండ్​ ఫ్రీక్వెన్సీ, రూ. 9,428.20 కోట్ల విలువైన 2500 ఎంహెచ్​జెడ్​ బ్యాండ్ ​ఫ్రీక్వెన్సీ తాజా ప్యాకేజ్​లో భాగంగా బీఎస్​ఎన్​ఎల్​కు లభించనున్నాయి.