బీఎస్పీ అధినేత్రి మాయావతికి మాతృవియోగం

బీఎస్పీ అధినేత్రి మాయావతికి మాతృవియోగం

బహజన్ సమాజ్ వాదీ పార్టీ (BSP) అధ్యక్షురాలు మాయావతికి మాతృవియోగం కలిగింది. మాయవతి తల్లి రామ్రాటి (92) ఇవాళ(శనివారం) ఢిల్లీలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్త విని మాయావతి వెంటనే లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మాయవతి తల్లి అంత్యక్రియలు రేపు ఢిల్లీలో నిర్వహించనున్నారు.

రామ్రాటి మృతి పట్ల పలువురు బీఎస్పీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేస్తున్నారు.