మిర్చి వ్యాపారి ఇంట్లో చోరీ

మిర్చి వ్యాపారి ఇంట్లో చోరీ

గద్వాల, వెలుగు: పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మిర్చి వ్యాపారి ఉప్పరి శ్రీనివాస్  ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఆదివారం ఆయన ఫ్యామిలీ ఐజ మండలం బింగిదొడ్డికి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు సోమవారం రాత్రి తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడి నాలుగున్నర లక్షల నగదు, మూడు తులాల గోల్డ్ ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి రాగా తలుపులు పగిలి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు గద్వాల టౌన్  ఎస్ఐ శ్రీనివాస్  తెలిపారు.