రెండు బస్సులు ఢీకొని ముగ్గురు మృతి..

రెండు బస్సులు ఢీకొని ముగ్గురు మృతి..

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.  శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకుని నల్గొండకు తిరిగి వెళ్తున్న వోల్వో బస్సును ఎదురుగా వస్తున్న అమరావతి బస్సు ఢీకొంది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా… చంద్రగిరి మండలం కాసిపెంట్ల వద్ద జరిగింది. చనిపోయిన వారిలో అమరావతి బస్సు డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. 25మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించడానికి ఆంబులెన్సులు లేకపోవడంతో లారీలలో తీసుకెళ్లారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి గ్యాస్ కట్టర్ లను ఉపయోగించారు. క్షతగాత్రులను రూయా హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.