జమ్మూకశ్మీర్ లో నదిలో పడిన బస్సు

జమ్మూకశ్మీర్ లో నదిలో పడిన బస్సు

జమ్ముకశ్మీర్ లో పహల్గామ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది సైనికులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని శ్రీనగర్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. చందన్వారి సమీపంలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు నదిలోకి పడిపోయింది.

ప్రమాదం సమయంలో బస్సులో 39  మంది ఉన్నారు. వీరిలో 37 మంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు కాగా..మరో ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీసులు. ఈ ప్రమాదంలో ఐటీబీపీ జవాన్లు ఆరుగురు మరణించారు. అమర్‌నాథ్ లో బందోబస్తు  విధులు నిర్వర్తించి అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు చందన్వారి నుంచి శ్రీనగర్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళ్తుండగా నదిలో పడింది.