న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్కు చెందిన -- బైజూ.. కోర్సు, సబ్స్క్రిప్షన్ ఫీజులను 30–-40 శాతం తగ్గించింది. అమ్మకాల ప్రోత్సాహకాలను 50-–100 శాతం పెంచింది. సంస్థ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడం ప్రారంభించిన బైజు వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్, 1,500 మంది సేల్స్ అసోసియేట్లు, మేనేజర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
బైజూ లెర్నింగ్యాప్ వార్షిక చందాను రూ.12 వేలకే ఇస్తున్నామని తెలిపింది. బైజూస్ క్లాస్, ట్యూషన్ సెంటర్ల ఫీజులు వరుసగా రూ. 24 వేలుకు, రూ. 36 వేలకు తగ్గాయి. దీంతో దాదాపు 30–-40 శాతం రేట్లు తగ్గినట్లు కంపెనీ వర్గాలు తెలిపారు.