40 శాతం వరకు ఫీజులను తగ్గించిన బైజూస్‌

40 శాతం వరకు ఫీజులను తగ్గించిన బైజూస్‌

న్యూఢిల్లీ: ఎడ్‌‌‌‌‌‌‌‌టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్​కు చెందిన -- బైజూ.. కోర్సు, సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ ఫీజులను 30–-40 శాతం తగ్గించింది. అమ్మకాల ప్రోత్సాహకాలను 50-–100 శాతం పెంచింది.  సంస్థ  రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడం ప్రారంభించిన బైజు వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్, 1,500 మంది సేల్స్ అసోసియేట్‌‌‌‌‌‌‌‌లు,  మేనేజర్‌‌‌‌‌‌‌‌లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 

బైజూ లెర్నింగ్​యాప్​ వార్షిక చందాను రూ.12 వేలకే ఇస్తున్నామని తెలిపింది. బైజూస్ క్లాస్​, ట్యూషన్ సెంటర్ల ఫీజులు వరుసగా రూ. 24 వేలుకు,  రూ. 36 వేలకు తగ్గాయి. దీంతో దాదాపు 30–-40 శాతం రేట్లు తగ్గినట్లు కంపెనీ వర్గాలు తెలిపారు.