Gold News: గోల్డ్ బాంబుపై భారతీయులు.. టిక్-టిక్ మంటున్న పెద్ద ప్రమాదం, నిపుణుడి హెచ్చరిక

Gold News: గోల్డ్ బాంబుపై భారతీయులు.. టిక్-టిక్ మంటున్న పెద్ద ప్రమాదం, నిపుణుడి హెచ్చరిక

Gold Rate Shock: భారతీయులకు బంగారానికి మధ్య ఉన్న సంబంధం ఈనాటిది కాదు. పురాణాల్లో సైతం బంగారం వినియోగం, ఆర్థిక ప్రయోజనాల గురించి ప్రస్థావన ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఏ శుభకార్యమైనా ముందుగా ఇండియన్ ఫ్యామిలీలు షాపింగ్ చేసేది బంగారం, వెండి వంటి ఖరీదైన ఆభరణాలనే. అంటుకే భారతీయులు ప్రతి ఏటా టన్నుల్లో బంగారాన్ని కొంటూనే ఉంటారు. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రిటైల్ వినియోగం చైనా తర్వాత ఇండియాలోనే అధికంగా ఉండొచ్చు.

అయితే ప్రస్తుతం ఈ అలవాటే ప్రజలను, ఆర్థిక వ్యవస్థను పెద్ద ప్రమాదం అంచున ఉంచిందా అనిపిస్తోంది. దీనిపై సీఏ ఆత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 2 ట్రిలియన్ డాలర్లు విలువైన బంగారం ప్రజల దగ్గర, చిన్న బంగారు వ్యాపారులు వద్ద ఉందని ఆయన అన్నారు. అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని మెుత్తం విలువ సుమారు రూ.80 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చితుల కారణంగా పెరిగిన పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలటం లేదా భారీ క్షీణతను చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ తలకిందులౌతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

గత ఆర్థిక సంవత్సరంలో ఇండియన్స్ అన్నింటి కంటే ఎక్కువగా బంగారాన్నే నమ్మారు. దేశంలో 25వేల టన్నుల బంగారం ఎలాంటి హెడ్జింగ్ లేకుండా ఉండటం అనుకోని పరిస్థితులు ఏర్పడితే నష్టాలకు దారితీస్తుందనే ఆందోళనలను పెంచుతోంది. చిన్న జ్యూవెలరీ షాపుల యజమానులు సైతం పెరుగుతున్న గోల్డ్ ధరలతో అధికంగా స్టాక్ కొనుగోళ్లు చేయటం కూడా వారిని ప్రమాదంలోకి నెట్టుతోంది. 

అయితే ప్రమాదం ఇక్కడితో ఆగిపోలేదు. కోట్ల మంది భారతీయులు ఎక్కువగా బంగారు రుణాలపై అత్యవసర డబ్బు అవసరాల కోసం ఆధారపడుతున్నారు. పెరిగిన గోల్డ్ రేట్లకు అనుగుణంగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ప్రస్తుతం ప్రజలకు రుణాలను అందిస్తున్నాయి. అయితే ఇక్కడ గోల్డ్ రేట్లు పతనం అయితే వారు తగ్గిన విలువకు అనుగుణంగా రుణాలను అందించటంతో పాటు ఇప్పటికే తీసుకున్న రుణ దాతలను తిరిగి చెల్లింపులకు డిమాండ్ చేయవచ్చు. దానిని చేయలేని వ్యక్తుల బంగారాన్ని వేలం వేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

►ALSO READ | మీకు బెంగళూరులో ప్రాపర్టీ ఉందా..? ఐతే మీకే ఈ గుడ్‌న్యూస్..

బంగారాన్ని పెట్టుబడి అవసరాల కోసం ఉపయోగించే రిటైలర్లతో పాటు గోల్డ్ ఎక్కువగా కొంటున్న ప్రజలు తగ్గే ధరలతో ఊహించని నష్టాన్ని చూసే ప్రమాదం ఉంటుందని ఆత్రేయ అన్నారు. ప్రస్తుతం భారతీయ చట్టాలు బ్యాంకులను గోల్డ్ రేట్ల రిస్క్‌ను యాక్టివ్‌గా నిర్వహించేందుకు అనుమతించకపోవటం బ్యాంకులకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందన్నారు. 

మెుత్తానికి బంగారం రేట్లు తగ్గితే ఎక్కువగా నష్టపోయేది మాత్రం భారతీయ సామాన్య ప్రజలేనని సీఏ హెచ్చరించారు. అంతర్జాతీయ మార్కెట్లు, ఓవర్-ది-కౌంటర్ ఉత్పన్నాల ద్వారా విస్తృత హెడ్జింగ్‌ను అనుమతించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తీసుకున్న చర్యను ఆయన ప్రశంసించారు. అయితే ఈ సాధనాలు ప్రధానంగా రోజువారీ వినియోగదారులకు లేదా చిన్న ఆభరణాల వ్యాపారులకు కాకుండా పెద్ద సంస్థాగత ఆటగాళ్లకు ప్రయోజనం చేకూరుస్తాయని హెచ్చరించింది. ఒక్కసారి బంగారం ధర పతనం అయితే ఆ షాక్ భారతదేశంలో జాతీయ సంక్షోభంగా మారగలదని ఆత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు.