- మైనర్ను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు
జూబ్లీహిల్స్,వెలుగు: మహిళల వాష్ రూమ్లో కెమెరా ఆన్ చేసి సెల్ఫోన్ను ఉంచిన మైనర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్ నం.10 లో ఉండే డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో ఓ యువతి హౌస్ కీపింగ్ విభాగంలో పని చేస్తోంది. బుధవారం సాయంత్రం ఆమె వాష్ రూమ్కు వెళ్లింది. బాత్రూం కిటికి వద్ద ఓ సెల్ఫోన్ ఉన్నట్లు గమనించింది. వెంటనే డ్రైవ్ ఇన్ నిర్వాహకులకు ఈ విషయం చెప్పింది. వారు మొబైల్ ను తీసుకుని పరిశీలించి కెమెరా ఆన్ చేసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో సదరు యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవ్ ఇన్లో పనిచేసే ఓ మైనర్ బాత్రూంలో సెల్ ఫోన్ పెట్టినట్లు నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నల్గొండకు చెందిన ఆ మైనర్ను డ్రైవ్ ఇన్లో ఎలా పనిలో పెట్టుకున్నారనేది తెలియాల్సి ఉంది.