
హిందువులు పూజలు చేస్తుంటారు. కొంతమంది రోజు పూజ చేస్తారు.. మరికొందరు వారానికొకసారి .. ఇంకొందరు .. పండగకో.. పబ్చానికోచేస్తారు. పూజ చివరిలో కర్పూరం వెలిగిస్తారు. ఆధ్యాత్మిక గ్రంధాల ప్రకారం.. హారతి ఇచ్చిన తరువాతనే పూజ సంపూర్ణంగా ముగిసిందని భావిస్తారు. పూజలో కర్పూర హారతికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం..
పూజ చేసేటప్పుడు ఉపయోగించే వస్తువులన్నింటికి శాస్త్రీయ పరంగా.. ఆరోగ్య పరంగా కూడా చాలాఉపయోగాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పూజలో కర్పూరం వెలిగించడం వలన ఇంట్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. అంతే కాకుండా ఇంట్లో ప్రతికూల శక్తి పాజిటివ్గా మారుతుందని పండితులు చెబుతున్నారు.
ఆయుర్వేద వైద్యంలో కర్పూరానికి ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. సహజ సిద్ద పద్దతిలో దీనికి తయారు చేసేవారు ఆవుపేడను.. మోదుగు.. జమ్మి.. రావి.. పుల్లలను .. ఉపయోగిస్తారు. వీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటితో తయారు చేసిన కర్పూరం పొగ... పీల్చితే శ్వాశకోస వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే.. కర్పూరాన్ని మెత్తగా మిక్సీ చేసి.. నీటిలో కలిపి నేలను తుడిస్తే చీమలు... బ్యాక్టీరియా .. ఇతర హాని కీటకాలు ఉండవు.
Also Read : మీ జాతకంలో ఈ 4 గ్రహాలు ఉంటే.. ఉద్యోగంలో తిరుగుండదు
ఇంట్లో కర్పూరాన్ని గాజు పాత్రలో ఉంచడం వల్ల స్వచ్ఛమైన గాలి ప్రసరిస్తుందని చెబుతున్నారు. ప్రతి రోజు కర్పూరాన్ని వెలిగించడం వలన ఇంట్లో ఉండే చెడుగాలి బయటకు వెళ్లి పర్యావరణం స్వచ్ఛంగా మారుతుంది.కర్పూరాన్ని వెలిగించడం వలన గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. అందుకే కలుషిత ప్రాంతాలలో నివసించే ప్రజలు వ్యాధులను నివారించడానికి కర్పూరాన్ని వెలిగించాలని చెబుతున్నారు.
సహజంగా రాత్రి సమయంలో ప్రతికూల శక్తులు తిరుగుతుంటాయని పండితులు చెబుతుంటారు. ఆధ్యాత్మిక నిపుణులు తెలిపిన వివరాలప్రకారం సాయంత్రం కర్పూరం వెలిగిస్తే.. ఆ పొగ ప్రభావంతో ఇంట్లోకి అలాంటి రావని నమ్ముతుంటారు.