రాష్ట్రంలో పలు రైళ్లు రద్దు...ఆగస్టు 6 వరకు ఈ రూట్లలో నడవవు..

రాష్ట్రంలో పలు రైళ్లు రద్దు...ఆగస్టు 6 వరకు ఈ రూట్లలో నడవవు..

కాజీపేట నుంచి నడిచే ప్యాసింజర్​ రైళ్లపై వర్షాల ఎఫెక్ట్​ బాగానే పడింది. అక్కడి నుంచి నడిచే పలు ప్యాసింజర్​ రైళ్లను మరికొన్ని రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వరదలు, మూడో లైన్​ నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

ఈ మార్గంలోని పలు రైళ్లను ఈ నెల 31వరకు రద్దు చేస్తున్నట్లు గతంలో రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాటి రద్దు డేట్​ని ఆగస్టు 6 వరకు పొడగించారు. 

రద్దైన రైళ్ల వివరాలివి..

కాజీపేట ‌‌‌‌‌‌--– డోర్నకల్ : పుష్​పుల్​(07753/54)
సికింద్రాబాద్​– వరంగల్: పుష్​పుల్​(07462/63)
కాజీపేట – సిర్పూర్​కాగజ్​నగర్​: రామగిరి ఎక్స్​ప్రెస్​(17003/4)
కాజీపేట –  బల్లార్షా: బల్లార్షా ఎక్స్​ప్రెస్​(17035 / 36)
భద్రాచలం రోడ్​– బల్లర్షా: సింగరేణి ఎక్స్​ప్రెస్​(17033/34)