
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒత్తిడికి గురికావొద్దని రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, రామయ్య పోలీస్ అకాడమీ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ చెప్పారు. కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం సరూర్ నగర్ గ్రౌండ్లో యోగా, మెడిటేషన్, మోటివేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ త్వరలో జరుగుతున్నాయని, ఈ నెలలోనే డీఎస్సీ, గురుకుల నోటిఫికేషన్ రాబోతుందని చెప్పారు.
తమ కోచింగ్ సెంటర్లలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఆన్లైన్, ఆఫ్ లైన్మోడ్లలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ రామదాసు, అప్పా డైరెక్టర్ శికామణి, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొని వారి సలహాలు, సూచనలు తెలియజేశారు.