- లేకపోతే ఢిల్లీ వరకు పోరాటం
- రెండో రోజు దీక్షలో ఎమ్మెల్యే శ్రీగణేశ్
పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడమే ఏకైక మార్గమని ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ వ్యవస్థ రద్దు చేసి వెంటనే విలీన ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల లోపే విలీనం చేయాలని, లేదంటే ఢిల్లీ వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
