కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలో సెక్యూరిటీ కాంట్రాక్ట్ కొత్త టెండర్ అమలులోకి తీసుకవచ్చి తమకు ఉపాధి కొనసాగేలా కృషి చేయాలంటూ సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు మంగళవారం మంత్రి వివేక్వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు.
పాత టెండర్ ద్వారా గత పదేండ్లుగా 213 మంది విధులు నిర్వహిస్తున్నామని మంత్రికి తెలిపారు. అనంతరం మందమర్రిలో నూతన వధూవరులు కాంగ్రెస్ లీడర్ చిప్పకుర్తి శశిధర్, -సౌమ్యను మంత్రి ఆశీర్వదించారు. అనంతరం దీపక్ నగర్కు చెందిన కాంగ్రెస్ లీడర్, స్కూల్యాజమానిపోలు శ్రీనివాస్ తండ్రి పోశం అనారోగ్యంతో, పాలచెట్టు ఏరియాకు చెందిన మల్లేశ్వరి రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు.
