200 మందికి కుట్టు మిషన్లు పంపిణీ..  ఎమ్మెల్యేకు లబ్ధిదారుల కృతజ్ఞతలు

200 మందికి కుట్టు మిషన్లు పంపిణీ..  ఎమ్మెల్యేకు లబ్ధిదారుల కృతజ్ఞతలు

పద్మారావునగర్, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. మైనారిటీ వెల్ఫేర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గానికి 200 కుట్టు మిషన్లు మంజూరు చేయించి పంపిణీ చేయగా, మంగళవారం బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, కడక్​పుర, పెన్షన్ లైన్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఐకమత్యంతో కష్టపడి వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు.