ముగ్గురి మృతి: స్నేహితుడి పెండ్లికి వెళ్తూ మృత్యుఒడిలోకి….

ముగ్గురి మృతి: స్నేహితుడి పెండ్లికి వెళ్తూ మృత్యుఒడిలోకి….

స్నేహితుడి పెండ్లికి వెళ్తున్న యువకుల కారు ప్రమాదానికి గురైంది. కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ హైవేపై జరిగింది. హైదరాబాద్ నుంచి ఎనిమిదిమంది స్నేహితులు కలిసి వెర్టిగా TS 08 G 4484 కారులో అనంతపూర్ కు వెళ్తున్నారు. షాద్ నగర్ సమీపంలో వీళ్ల కారు మరో కారును ఓవర్ టేక్ చేయబోయి ప్లైఓవర్ పై నుంచి కిందికి దూసుకుపోయింది. దీంతో కారు బోల్తా కొట్టి ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందాగా… మరో నలుగురు గాయపడ్డారు. ఒక వ్యక్తి మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తక్షణమే స్పంధించిన స్థానికులు గాయపడిన వారిని ఓ ప్రైవేట్ వాహనంలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.