రోడ్డు ప్రమాదం: నిన్న జూబ్లీహిల్స్‌లో.. నేడు ఎల్బీ నగర్‌లో..

రోడ్డు ప్రమాదం: నిన్న జూబ్లీహిల్స్‌లో.. నేడు ఎల్బీ నగర్‌లో..

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్న జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదం ఘటన మరువకముందే.. ఈ రోజు ఉదయం ఎల్బీ నగర్‌లో మరో ప్రమాదం జరిగింది. దిల్‌షుక్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్తున్న కారు మితిమీరిన వేగంతో వచ్చి రోడ్డు దాటుతున్న మహిళల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. అంతేకాకుండా ముందుగా వెళ్తున్నమరో కారును కూడా ఢీకొట్టింది. ఆ తర్వాత మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి బొల్తా పడింది. గాయపడ్డవారిని వెంటనే ఓజోన్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తల కోసం..
మహిళపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. రికార్డయిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు