రాయదుర్గంలో కారు బీభత్పం..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

రాయదుర్గంలో కారు బీభత్పం..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

హైదరాబాద్: మాదాపూర్ రాయదుర్గంలో కారుతో బీభత్సం సృష్టించాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మద్యం మత్తులో కారును డ్రైవ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులను ఢీకొట్టాడు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురికి  తీవ్రగాయాలయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పిస్తా హౌజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారును వెంబడించిన స్థానికులు మల్కం చెరువు ఫ్లై ఓవర్ పై కారును అడ్డగించి కారు నడుపుతున్న సాఫ్ట్ వేర్ క్రాంతి కుమార్ను  పట్టుకున్నారు. అనంతరం రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.