రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు .. గొలుసు కోసం మహిళను ఈడ్చుకెళ్లారు 

రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు .. గొలుసు కోసం మహిళను ఈడ్చుకెళ్లారు 

చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు  మేడలో నుంచి బంగారాన్ని దొచుకెళ్తున్నారు. తాజాగా  మార్నింగ్ వాక్‌ కోసం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మేడలో నుంచి బంగారాన్ని దొచుకెళ్లే ప్రయత్నం చేశారు.  అయితే మహిళ ప్రతిఘటించడంతో చైన్‌ స్నాచర్లు తప్పించుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని కోయింబత్తూర్ లో చోటుచేసుకుంది.  

కోయింబత్తూర్ కు చెందిన కౌసల్య మే 15  సోమవారం రోజున మార్నింగ్ వాక్‌ కోసం అని  వెళ్లింది. ఈ క్రమంలో ఓ వైట్ కారులో ఇద్దరు దుండుగులు ఆమెను ఫాలో ఆయ్యారు.  అయితే   ప్యాసింజర్ సీటులో కూర్చున్న ఓ వ్యక్తి ఆమె చైన్ ను పట్టుకున్నాడు.  వెంటనే అప్రత్తమైన ఆ మహిళ తన  చైన్ ను గట్టిగా పట్టుకుంది.  దీంతో మరో వ్యక్తి  కారు  స్పీడ్ పెంచడంతో కొన్ని మీటర్ల మేర కారుతో పాటు  ఆ మహిళను ఈడ్చుకెళ్లారు. 

అయినప్పటికీ ఆ మహిళ చైను గట్టిగా పట్టుకోవడంతో స్నాచర్లు అక్కడ్నుంచి జారుకున్నాడు. ఈ ఘటనలో మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దీనిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో సీసీ కెమెరాల అధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.