భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం పట్టణంలో నడిరోడ్డుపైనే ఓ కారు దగ్ధమైంది. పట్టణంలోని గణేష్ టెంపుల్ ప్రధాన రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. మల్లికార్జున అనే వ్యక్తి కొత్తగూడెం నుంచి పాల్వంచకు వెళుతుండగా కారు లో షార్ట్ సర్కూట్ వలన ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే కారులోంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. నడిరోడ్డుపైనే కారు దగ్ధం కావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.