విజయవాడ హైవేపై కారులో మంటలు

విజయవాడ హైవేపై  కారులో మంటలు

హైద్రాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి దగ్గర అదుపుతప్పి కారు బోల్తా పడింది. ప్రమాద ధాటికి కారులో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు పూర్తిగా కాలిపోయింది. కారు ఖమ్మం నుంచి హైద్రాబాద్ వెళ్తుతుండా   ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు పోలీసులు.