దుండిగల్ లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

దుండిగల్ లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

కుత్బుల్లాపూర్:  ఇటీవలకాలంలో యువకులు మితిమీరిన వేగంగా కార్లను డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాల్లో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కారు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం అర్థ రాత్రి దుండిగల్ నుండి నాగళూరు వెళ్లే దారిలో వేగంగా దుసుకు వచ్చిన కారు.. అదుపుతప్పి జ్యోతిరావు పూలె విగ్రహానికి ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చినిపోయిన యువకుడిని మహీంద్రా యూనివర్సిటీకి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.