యూపీలో ఘోర ప్రమాదం.. 8 మంది సజీవదహనం

యూపీలో ఘోర ప్రమాదం.. 8 మంది సజీవదహనం

ఉత్తరప్రదేశ్ బరేలిలోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో నైనిటాల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. కారు ట్రక్కు ఢీ కొని భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కారులోని ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. కారు, ట్రక్కును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. 

టైర్ పగిలిపోవడంతో కారు ఉత్తరాఖండ్ నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి రెండు వాహనాల్లో మంటలు అంటుకున్నాయి. స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. డోర్లు లాక్ కావడంతో కారులోని ఎనిమిది అగ్నికి ఆహూతయ్యారు. మృతుల్లో ఏడుగురు పెద్దలు, ఒక చిన్నారి ఉన్నారు. ట్రక్కులోని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.